ఫ్యామిలీతో క‌లిసి చూడ‌ద‌గిన సినిమా ” పురుషోత్తముత్తడు” మూవీ రివ్యూ…

బ్యానర్ – శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్

మూవీ : పురుషోత్తముత్తడు

నటీనటులు

రాజ్ తరుణ్

హాసినీ సుధీర్

ప్రకాష్ రాజ్

మురళి శర్మ

రమ్య కృష్ణ

బ్రహ్మానందం

విరాన్ ముత్తంశెట్టి

ముకేష్ ఖన్నా

ప్రవీణ్

బ్రహ్మాజీ

రాజా రవీంద్ర

సత్య

తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రఫీ – పీజీ విందా

మ్యూజిక్ – గోపీ సుందర్

సాహిత్యం – చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి

పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే

నిర్మాతలు – డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, పీఆర్ ఓ- సురేష్ కొండేటి

రచన, దర్శకత్వం – రామ్ భీమన

చిన్న సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న‌ రాజ్ త‌రుణ్ ఇటీవ‌ల‌ మంచి హిట్ లేదు. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కాస్త‌ గ్యాప్ తీసుకొని పురుషోత్తముత్తడు అవ‌తారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇట‌వ‌ల టీజర్, ట్రైలర్‌ల‌తో అంచ‌నాలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజు (శుక్ర‌వారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
రచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. తండ్రి(మురళీశర్మ) అతన్ని తన పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీకి CEOని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్క‌డికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్క‌డ ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసు(రమ్యకృష్ణ). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు(విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రామ్ క‌ట్టుబ‌ట్ట‌ల‌తో అజ్ఞాతంలోకి వెళ్లకళ్ల తప్పదు. రాజమండ్రి దగ్గర‌లోని కడియపులంక అనే గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో పూల‌తోట‌లు నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గరగ్గ పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి)ట్టికుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
రామ్ పాత్రకు రాజ్ తరుణ్ పూర్తి న్యాయం చేశాడు. గ్లామ‌ర్ ఆండ్ యాక్టింగ్‌లో గ‌తం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. హీరోయిన్ హాసిని సుధీర్ గ్లామ‌ర్ యూత్‌ను ఎట్రాక్టు చేస్తుంది. ఇక సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ త‌న పాత్ర‌కు నిండుత‌నం తెచ్చారు. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు త‌మ త‌మ పాత్ర‌ల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.

ఎలా ఉందంటే?
హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమంలో అన్యాయానికి గుర‌వుతున్న‌ పేద ప్రజల కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయంగా నిల‌బ‌డ‌తాడు. ఇలాంటి పాయింట్స్‌తో ఇప్ప‌టికే కొన్ని సినిమాలు వ‌చ్చినా కూడా ఈ సినిమా క‌థ‌ను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు ద‌ర్శ‌కుడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాట‌లు ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు, ఫ్యామిలీతో క‌లిసి చూడ‌ద‌గిన సినిమా.

maamovie.com Rating : 3.25/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *